ఏపీ అసెంబ్లీలో టీడీపీకి స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం జ‌గ‌న్..

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యుల తీరుతో సభ నడిచే అవకాశం లేకుండాపోతోందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియంను చుట్టుముట్టడంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేం 151మంది ఉన్నా ఎంతో ఓపికా ఉన్నామన్నారు. వైసీపీ సభ్యుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు జగన్.

టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని తెలిపారు. సభలో మాట్లాడే చేతకాకపోతే సభ బయటే ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా పోడియం వద్దకు వస్తే… మార్షల్స్‌తోబయటకు ఈడ్చేస్తామన్నారు. పోడియం వద్ద మార్షల్స్‌ను పిలిపించి ఉంచాలన్నారు. ఎవరైనా రింగ్ దాటి లోపలికి వస్తే.. వెంటనే బయటకు పంపించేయండని స్పీకర్‌కు తెలిపారు సీఎం జగన్. దీంతో స్పీకర్ వెంటనే మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news