ఏపీ: జులై 4న ఢిల్లీకి సిఎం జగన్…

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జులై 4వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ అక్కడ 2 రోజుల పాటు వివిధ కార్యకలాపాలను చూసుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. కాగా జులై 4 సాయంత్రం ఢిల్లీ కి చేరుకొని పక్క రోజు జులై 5న ప్రధాని మోదీతో మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో పాటుగా పలువురు కేంద్రమంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించి కొన్ని విషయాలను గురించి అడగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేకంగా రావాల్సిన అన్ని నిధులను, ప్రత్యేక హోదాను మరియు పెండింగ్ లో ఉన్న కొన్ని నిధులను గురించి చర్చించనున్నారు.

ఇక పనిలో పనిగా త్వరలోనే ఎన్నికలు జరగనుండడంతో దాని గురించి సైతం ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news