ఏపీ కరోనా అప్డేట్.. 8,218 కేసులు, 58 మరణాలు !

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారిందని చెప్పచ్చు. ప్రభుత్వాలు ఎన్ని కీలక చర్యలు తీసుకున్నా వైరస్ ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 617776కు పెరిగింది.

ap-corona
ap-corona

ఒక్కరోజు వ్యవధిలో మరో 58 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5302కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. నేడు కొత్తగా 10,820 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 530711 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కూడా ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news