ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 493 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా ఉండటం లేదు. ఓ రోజు భారీగా పెరుగుతూ.. ఓ రోజు భారీగా తగ్గిపోతున్నాయి కరోనా కేసులు. ఇక నిన్న 523 కరోనా కేసులు నమోదు కాగా ఇవ్వాళ ఆ సంఖ్య 400 చేరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,62, 303 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఏడుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 327 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5500 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 552 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41, 820 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 91, 42 , 162 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,42, 476 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news