ఏపీలో భయం భయం : 24 గంటల్లో 491 మందికి కరోనా..!

-

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య కొంచం అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒకింత శుభమే అయినా.. రానున్న రోజుల్లో ఇది ఎలా మారుతుందో అర్ధం కావట్లేదు. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 491 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో కొత్తగా 83 కేసులు, విదేశాల నుంచి వచ్చినవారిలో 18 కేసులు గుర్తించారు. అలాగే రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 101కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,452గా నమోదైంది. ఇప్పటివరకు 4,111 డిశ్చార్జి కాగా, 4,240 మంది చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news