బిగ్ బ్రేకింగ్ : ఏపీలో 10 వేలకి చేరువలో కరోనా కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు.

గత 24 గంటల్లో కొత్తగా 462 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 119కి చేరింది. తాజాగా 129 మంది కోలుకొని డిశ్చార్జి అవ్వడంతో… మొత్తం రికవరీల సంఖ్య 3566గా ఉంది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news