ఏపీలో కరోనా విశ్వరూపం.. రికార్డు స్థాయిలో కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, సోమవారం నాడు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 1,935 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 1,030 మంది డిశ్చార్జి కాగా.. మరో 37 మంది మరణించారు. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. వీరిలో కరోనా నుంచి 16,464 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 14,274 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news