ఏపీలో కొత్త‌గా 121 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం న‌మోదు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న పెరిగిన క‌రోనా కేసులు.. ఇవాళ కాస్త త‌గ్గాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 121 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075804 కి పెరిగింది.

ap carona
ap carona

ఇక కోవిడ్ వల్ల కృష్నా లో ఒకరు మరణిం చారు. దీంతో క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14479 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1597 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 228 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2059728 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 29,643 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,09,90,296 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news