ఏపీలో కొత్తగా 160 కరోనా కేసులు, ఒక మరణం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన తర్వాత హెల్త్ కరోనా బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 160 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కేవలం ఒకరు మాత్రమే మరణించారు.

carona ap
carona ap

అలాగే గడచిన 24 గంటల్లో 201 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. 30, 859 కరోనా పరీక్షలను చేసింది ఆరోగ్యశాఖ. దీంతో కరోనా మహమ్మారి పరీక్షల సంఖ్య… 3,07,77,396 కు చేరింది. ఇక ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 14, 466 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 1912 గా నమోదు అయింది. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 2058490 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news