ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు, ఒక మరణం

-

ఏపీలో కరోనా కేసులు రోజు రోజు కు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల లో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20, 71, 567 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 429 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2159 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 242 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 54 , 979 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 26 , 119 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 02 , 23 , 680 కరోనా పరీక్షలు చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news