ఏపీలో పెరిగిన కరోనా.. కొత్తగా 215 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 50 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 215 కరోనా కేసులు నమోదయ్యాయి. . దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67, 921 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చని పోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 392 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3568 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 406 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,49, 961 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 30 , 831 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 97 , 06 , 769 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news