ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 400 కేసులు, 4 మరణాలు నమోదు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత.. తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువే ఉంది. మొదట్లో విపరీతంగా కరోనా కేసులు త్వరగా ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,63, 577 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 4 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 343 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5102 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 516 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,43, 616 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 37, 744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 92, 64 , 255 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news