ఏపీ కరోనా అప్డేట్.. ఇవాళ కొత్తగా 310 కేసులు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు.. తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. నిన్న టి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ భారీ గా తగ్గిపోయాయి. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 310 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,57, 562 కి పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో 7258 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,256 కి చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 994 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,36, 048 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 23, 022 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 87, 67 , 963 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news