ప్రజల తిరుగుబాటు తప్పదు… ఏపీ జగన్ పై నోరుపారేసుకున్న డిప్యూటీ సీఎం !

-

తిరుమల : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి నోరు జారారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే సమయం లో…. ప్రజలే జగన్ మోహన్‌ రెడ్డి పై దాడి చేసే రోజులు రాబోతున్నాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. జగన్‌ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయని నోరు జారారు. పక్కన ఉన్న నేతలు సైగ చేయడంతో.. మళ్లీ మాట మార్చారు డిప్యూటీ సీఎం.

ఆ తర్వాత… పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తన వ్యక్తిత్వం తగ్గినట్లేనని నారాయణ స్వామి తెలిపారు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రత్యక్షమవుతానన్న పవన్ కళ్యాణే….మహిళలకు అన్యాయం చేస్తూన్నారని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై వైసిపి దాడి చెయ్యడం లేదని…. పవన్‌ కళ్యాణే జగన్ పై దాడి చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కులానికి కూడా జగన్ లబ్ధి చేకూరుస్తూన్నారన్నారు. అయితే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… జగన్‌ పై నోరు జారిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news