డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పని చేస్తున్న డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్ల కు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఆ రాష్ట్రం లోని డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ మేరకు బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వుల విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది జగన్‌ సర్కార్‌.

jagan
jagan

ఐదేళ్లు.. అంతకు మించి ఒకే చోట పని చేసిన వారికి తప్పని సరి బదిలీ లు ఉంటాయని విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం గా పేర్కొంది సర్కార్‌.. అంతే కాదు…. ఐటీడీ ఏ ప్రాంతాల్లో పని చేస్తోన్న లెక్చరర్ల కు అదనంగా ఐదు పాయింట్ల కేటాయింపు కూడా వర్తిస్తుందని వెల్లడించింది ప్రభుత్వం. ఇక మిగితా ప్రాంతాల్లో పని చేసే వారికి మాత్రం ఎదా విధిగా ఉంటుందని తెలిపింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news