ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఏపీలో ఇక 9 గంటల ఉచిత కరెంట్

-

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని.. అనంత జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు కోరారని పేర్కోన్నారు. విద్యుత్ ఉద్యోగులకు జీతాల్లో ఎలాంటి కోత ఉండదని.. 2018 పీఆర్సీ మేరకు విద్యుత్ ఉద్యోగుల జీతాలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

విద్యుత్ సంస్థలకు రూ. 80 వేల కోట్ల మేర అప్పులు పెండింగులో పెట్టింది గత ప్రభుత్వమని పేర్కొన్నారు. పెండింగ్ అప్పులను తీర్చేందుకు సీఎం చాలా కృషి చేస్తున్నారని తెలిపారు బాలినేని శ్రీనివాస రెడ్డి.  వైసిపి ప్రభుత్వము రైతుల కోసం అనే పథకాలు తీసుకు వచ్చిందని… ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో ఏపీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news