ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం అమలు చేయబోతున్న స్కీమ్స్ ఇవే..!

-

జగనన్న ప్రభుత్వం అందించే స్కీముల బెనిఫిట్స్ ని చాలా మంది పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల లో ఏపీ ప్రభుత్వం స్కీమ్స్ ని అమలు చేయనుంది. జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వంటి పథకాల్ని అమలు చేయనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

మే నెలలో ఏపీ సర్కార్ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాలను అమలు చేయబోతోంది.
జూన్‌ నెల లో అయితే జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ లా నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహకాలను అమలు చేయనున్నారు.
విదేశీ విద్యా దీవెన,వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న తోడు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాలు ని జూలై లో తీసుకు రానున్నారు.
జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్స్ ని ఆగస్టు నెల నుండి సర్కార్ అమలు చేయనుంది.
వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే సెప్టెంబర్ లో అమలు చేయనున్నారు.
అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన స్కీమ్స్ ని తీసుకు రానున్నారు.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన పథకాలను నవంబర్ లో అమలు చేయనున్నారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాన్ని డిసెంబర్ లో అమలు చేయనున్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ లా నేస్తం, పెన్షన్ పెంపు జనవరి లో తీసుకు రానున్నారు.
ఫిబ్రవరిలో అయితే జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలు అమలు కానున్నాయి.
వసతి దీవెన, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహకాలు మర్చి నెల లో అమలు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news