వైద్యాశాఖ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన

-

అమరావతి : వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్నటు వంటి ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైద్యా రోగ్య శాఖ లో ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30 తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.

ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్లైనులో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది సర్కార్‌. మార్చి 4 వ తేదీ నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.

బదిలీ ప్రక్రియను మార్చి 20 వ తేదీ లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మార్చి 31 వ తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ లో బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. దీనిపై ఉద్యోగులు ఎలాంటి సందేహాలు ఉన్నా… ఉన్నతాధికారులను కలిసి.. తమ సందేహాలకు పరిష్కారం తెలుసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news