వైఎస్‌ఆర్ జలకళ పథకంలో కీలక మార్పులు..రైతులకు పూర్తి ఉచితంగా…!

-

ఉచితంగా బోర్లువేసి.. ఉచితంగా పంపుసెట్లు, మోటార్లు ఇవ్వడమే కాదు… వాటికి అవసరమైన విద్యుత్‌ కనెక్షన్‌నూ ఉచితంగానే ఇవ్వాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. రైతులకు అవసరమైన విద్యుత్ కనెక్షన్స్ కూడా ఉచితంగానే అమర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, భూమి రకం, ఎంత వరకు పంట సాగవుతోంది అనే అంశాల ఆధారంగా.. పంపుసెట్లు, మోటార్లను బిగించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

వైఎస్‌ఆర్ జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేయాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. వైఎస్‌ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు.. పంపుసెట్లు, మోటార్లనూ ఉచితంగానే అమర్చాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే, జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వటంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు.. ఉచితంగానే పంపుసెట్లు, మోటార్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news