కరోనా ఎఫెక్ట్: ఏపీలో 13 కోవిడ్‌ ప్రత్యేక సబ్ జైళ్లు..!

-

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు..కొత్తగా వచ్చే ఖైదీలకు 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జైళ్లశాఖ డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్‌, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురం జైళ్లను కోవిడ్‌ ప్రత్యేక జైళ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

 

ఈ సబ్ జైళ్లలో కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్‌ ను పాటించాలని సూచించారు. పరీక్షల అనంతరం నెగెటివ్ ఉన్న  ఖైదీలను మాత్రమే సాధారణ జైలుకు తరలించాలని తెలిపింది. పాజిటివ్ వ్యక్తులను వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జైళ్లలో పరీక్షలు చేసేందుకు ఒక మెడికల్ అధికారితో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news