ఏపీ – తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదే – జేడీ లక్ష్మీనారాయణ

-

సిబిఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని అన్నారు. రాష్ట్ర విభజన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు లక్ష్మీనారాయణ. ఇక గత ఎన్నికలలో విశాఖ నుంచి ఆయన పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనలను వెల్లడించారు.

వచ్చే ఎన్నికలలో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానని విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని.. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news