ఏపీలో తుది అంకానికి చేరిన పంచాయతీ పోరు

-

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తి కాగా రేపు నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ జరిగిఫలితాలు కూడా వెలువరించనున్నారు. ఏపీలో ఇప్పటికే మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, రేపు చివరిదైన నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో నిన్న సాయంత్రంతో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ చేపడతారు. 3,299 పంచాయతీలు… 33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాతీయలకు, వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.. చూడాలి మరి రేపు ఏమి జరగనుందని.

Read more RELATED
Recommended to you

Latest news