కేసీఆర్ మీద ఏపీ మంత్రి పరోక్ష వ్యాఖ్యలు !

-

ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ కేసీఆర్ ని పరోకషంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.  బీసీలను సీఎం చేస్తామని బీజేపీ చెప్పడం సంతోషంగా ఉందన్న ఆయన రాజకీయంగా ఏపీలో బీజేపీ స్థాయేంటీ.. బలమేంటీ..? అనేది చూసుకోవాలని అన్నారు. రాజకీయంగా బీజేపీకి ఏపీలో అవకాశం లేదు కాబట్టి.. బీసీను సీఎం చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. ఎస్సీలను సీఎం చేస్తామన్న రాష్ట్రాల్లో ఏమయ్యాయో చూశాం అంటూ ఆయన కేసీఆర్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.

అధికారం వచ్చేంత వరకు ఎస్సీ, బీసీలను ముందు పెడతారు.. అధికారం వచ్చాక దాన్ని మరుస్తారని ఆయన అన్నారు. సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీకి రాష్ట్రంలో ఓ స్థానం కూడా లేదు.. జనసేనకు ఒకే స్థానం ఉందని అన్నారు.  175 సీట్లున్న ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని.. బీసీని సీఎం చేస్తామని చెప్పడం రాజకీయ ప్రేరేపిత చర్యేనని ఆయన అన్నారు. బీసీ సీఎం అంటూ సోము చేసిన వ్యాఖ్య కల మాత్రమేనని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news