శ్రీవారి సేవలో ఏపీ మంత్రి జయరాం.. !?

-

తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్య ప్రజలతో పాటు ఎంతోమంది మహామహులు సైతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకొని శ్రీవారిని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు. అయితే తాజాగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి జయరాం దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో… కార్మిక శాఖ మంత్రి జయరాం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు కార్మిక శాఖ మంత్రి జయరాం కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన కోసం ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఇక శ్రీ వారి ని దర్శించుకున్న కార్మిక శాఖ మంత్రి జయరాం కి అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే తన కుమారుడికి వివాహం జరిగిన సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినట్లుగా కార్మిక శాఖ మంత్రి జైరాం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news