సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సర్కార్ లేఖ

-

అమరావతి రాజధాని అంశంపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై నేడు విచారణ జరుగనుంది. ఈ తరుణంలో అమరావతి రాజధాని అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సర్కార్ లేఖ రాసింది.

దీంతో నేడు విచారణకు అనుమతి ఇచ్చారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్. అటు ఇప్పటికే అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. అయితే.. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news