IPL ఆరంభ వేడుకల్లో ధోనీ పాదాలు తాకిన అర్జీత్ సింగ్.. ఫొటో వైరల్

-

IPL-16వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. కొవిడ్ వల్ల మూడేళ్లుగా నిరాడంబరంగా సాగిన ఐపీఎల్ ఈసారి అట్టహాసంగా మొదలైంది. శుక్రవారం రోజున అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు సందడి చేశారు. విద్యుద్దీపాల తళుకులు.. తారల మెరుపులు.. వినసొంపైన మ్యూజిక్.. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్​లతో ఐపీఎల్ అట్టహాసంగా ప్రారంభమైంది.

బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్‌ మ్యూజిక్‌ షోతో ప్రారంభమైన ఆరంభ వేడుకల్లో సినీ తారలు తమన్నా భాటియా, రష్మిక మందన్న సందడి చేశారు. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాటకు తమన్నా అదిరే స్టెప్పులు వేయగా, సూపర్‌హిట్‌ మూపీ పుష్పలోని ‘సామీ సామీ’ పాటకు రష్మిక మందన కాలు కదిపింది. అయితే ఐపీఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?

అర్జీత్ సింగ్.. చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పాదాలు తాకాడు. అర్జిత్‌ హఠాత్తుగా ఇలా చేయడంతో అతణ్ని వారించడానికి ధోనీ ప్రయత్నించాడు. అర్జీత్​ను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో తమన్నాతోపాటు రష్మిక కూడా వేదికపైనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అర్జీత్ చేసిన ఈ పనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫొటో ఆఫ్‌ ద డే అని ఒక అభిమాని అనగా, బెస్ట్‌ పిక్చర్‌ ఆన్‌ ఇంటర్‌నెట్‌ టుడే అని మరొకరు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news