హై టెన్షన్ : బ‌స్సు హైజాక్.. బందీలుగా 20 మంది..!

-

ఉక్రెయిన్‌లో ఓ దుండ‌గుడు బ‌స్సును హైజాక్ చేశాడు. ఉక్రెయిన్ లోని ల‌స్క్ న‌గ‌రంలో 20 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సును దుండ‌గుడు హైజాక్ చేసి ఓ థియేట‌ర్ స‌మీపంలో పార్క్ చేయించాడ‌ని, బ‌స్సులోని ప్ర‌యాణికులంద‌రినీ బందీలుగా చేసుకున్నాడ‌ని స్థానిక పోలీసులు వెల్ల‌డించారు. దుండగుడి ద‌గ్గ‌ర భారీగా పేలుడు ప‌దార్థాలు, ఆయుధాలు ఉన్నాయ‌ని చెప్పారు.

కాగా దీనిపై పోలీసులు స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. దుండగుడి డిమాండ్స్ ఏమిటో తెలియ‌డంలేద‌‌ని ఉక్రెయిన్‌ నేష‌న‌ల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. వ్య‌వ‌స్థపై అసంతృప్తి ఉందని దుండ‌గుడు చెబుతున్నాడ‌ని, అయితే ఏ వ్య‌వ‌స్థ అనేది మాత్రం అత‌ను క‌చ్చితంగా చెప్ప‌లేద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news