ఏపీలో ఇద్దరు  కలెక్టర్ల కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. !

-

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ ల కు హై కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ లు జారీ అయ్యాయి. ఈ నెల 19 లోపు వారెంట్ లు అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. విజయనగరం జిల్లా బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళి పదోన్నతి విషయంలో  హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అయిన కలెక్టర్ లు ఇద్దరికీ నిన్న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

అయితే వారిద్దరి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి జి.చంద్రమౌళికి హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్‌-1గా పదోన్నతి ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అవి అమలు కాకపోవడంతో చంద్రమౌళి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news