అశోక్‌ గజపతి, నారాయణ.. మళ్లీ అసెంబ్లీ బరిలోకి!

-

వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో.. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సారి అసెంబ్లీ బరిలోకి అశోక్ గజపతిరాజు, నారాయణ ను దింపేందుకు రంగం సిద్ధం చేశారు చంద్రబాబు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, నెల్లూరు సిటీ నుంచి నారాయణ దించాలని యోచిస్తున్నారు చంద్రబాబు.

ఈ మేరకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ వేధింపులతో మాజీ మంత్రి నారాయణ ఈసారి పోటీనుంచి విరమించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నారాయణను పిలిపించి మాట్లాడిన చంద్రబాబు… భారీ ఆధిక్యంతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్నారు. నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తారని జిల్లా నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news