రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం…

-

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 20న హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేశారు. రాష్ట్రపతి శనివారం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news