తలనొప్పితో బాధపడుతున్నారా..? ఈ మూడు జ్యూస్లతో తలనొప్పి మాయం..!

-

తరచూ మీకు తలనొప్పి వస్తుందా..? తలనొప్పి నుండి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ టిప్స్ ని అనుసరించండి. వెంటనే తల నొప్పి తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి కారణంగా చాలా మంది తలనొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య కారణంగా మందులు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఉపశమనం లభించకపోవచ్చు.

అయితే తలనొప్పి సమస్య నుండి బయట పడడానికి మందులు అవసరం లేదు. ఈ జ్యూస్ లని మీరు తీసుకుంటే తప్పకుండా క్షణాల్లో తలనొప్పి సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.

అరటిపండు మరియు పైనాపిల్ జ్యూస్ :

తల నొప్పిని తగ్గించడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. టెన్షన్ కారణంగా వచ్చిన తలనొప్పి చిటికలో మాయం అయిపోతుంది. మీరు అరటిపండుని పైనాపిల్ ను తీసుకుని మిక్సీలో బ్లెండ్ చేసి పాలు, నట్స్, పంచదార యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు.

క్యారెట్ కీరదోస జ్యూస్:

తలనొప్పి తగ్గడానికి క్యారెట్, కీరా జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది వెంటనే ఉపశమనాన్ని కూడా ఇది ఇస్తుంది.

లెమన్ జ్యూస్:

తలనొప్పి ఎక్కువగా ఉంటే లెమన్ జ్యూస్ ను కూడా మీరు తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే వెంటనే తల నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలానే మైగ్రేన్ సమస్య నుండి కూడా బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news