తెలంగాణాలో దారుణం: మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల పైశాచిక చర్యలు

-

కరోనా రెండో వేవ్ సమయంలో మాస్క్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణాలో ఒక ఘటన జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో పోలీసుల పైశాచికం వెలుగులోకి వచ్చింది. మాస్క్ పెట్టుకోలేదని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేణు అనే బీ.ఫార్మసీ విద్యార్థిని ఒళ్ళు కమిలి పోయేలా కర్రలతో ఎస్సై చితకబాదారు. ఎస్సై దెబ్బలతో ఒళ్ళంతా వాతలు, తీవ్ర గాయలై వేణు చికిత్స తీసుకుంటున్నాడు.

కరోనా నిబంధనల పేరుతో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ప్రొబిషనరీ ఎస్సై తనను గొడ్డును బాదినట్లు బాధారని కేటిఆర్, డీజీపీ పోలీస్ ఉన్నతాధికారులకు ట్విట్టర్ ద్వారా బాధితుడు ఫిర్యాదు చేసాడు. తన పేరు బయటకు చెప్తే వేరు కేసులు పెట్టి జైల్లో వేస్తానని ఎస్సై బెదిరించాడని బాధిత విద్యార్థి, అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news