తిరుపతి జిల్లాలో దారుణం, 12 ఏళ్ల చిన్నారికి మత్తు ఇచ్చి గ్యాంగ్ రేప్ !

-

తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు, సామూహిక అత్యాచారం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలికకు నిందితులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లినట్లు బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఎంఏ రాజుల కండ్రిగ గ్రామానికి వెళ్లి విచారించారు. ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news