మద్యం విక్రయిస్తున్నారని వెళ్తే మహిళా ఎస్సైని తన్నారు…!

-

ఆంధ్రప్రదేశ్ లో అక్రం మద్యం, నాటు సారా విక్రయాలపై సిఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు భయపెడుతున్నాయి. తాజాగా అనతపురం జిల్లా హిందూపురం ఘటనలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. హిందూపురంలోనీ బోయ పేటలో ఎక్సైజ్ మహిళా ఎస్సై సరోజాదేవి పై దాడి చేసారు.

స్థానిక బోయ పేటలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారు అన్న సమాచారం తో తనిఖీ కి ఎక్సైజ్ పోలీసులు వెళ్ళారు. దీనితో ఎక్సైజ్ పోలీసుల పై బోయపేటకు చెందిన రౌడీషీటర్ లక్ష్మి నారాయణ, కుటుంబ సభ్యులు దాడికి దిగారు. మహిళా ఎస్సై సరోజాదేవి తో పాటు కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. స్థానిక టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసారు ఎస్ ఈ బి పోలీసులు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news