సికింద్రాబాద్ లో దారుణం.. ప్రేమించలేదని యువతి పై కత్తితో దాడి

-

సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బోయిన్ పల్లి పరిధిలో ప్రియురాలి పై ఓ ప్రియుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన బుధ వారం పగలు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లోని బాపూజీ నగర్ కు చెందిన గిరీష్ అనే యువకుడు.. బోయినపల్లి లో నివాసం ఉంటున్న ఓ యువతిపై కత్తి తో దాడి చేసాడు. రెండు  ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.

crime
crime

అయితే కొద్దీ రోజులు క్రితమే మనస్పర్థలు వచ్చి ఈ ప్రేమ జంట విడిపోయింది. దీంతో తనని పెళ్లి చేసుకోవాలని వెంట పడ్డాడు. ఆ వేధింపులతో.. నశించిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనకు ఇష్టం లేదని చెప్పడం తో పథకం ప్రకారం బోయినపల్లి లోని యువతి ఇంటికి గిరీష్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. చివరికి ప్రియురాలి పై ప్రియుడు గిరీష్ కత్తి తో దాడి చేశాడు. అనంతరం తనకు తాను కత్తితో పొడుచుకున్నాడు గిరీష్. ఇక ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news