BREAKING : గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం

-

ఏపీ లో మ రో దారుణం చోటు చేసుకుంది. బలవంతంగా ఓ మహిళపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించిన సంఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో.. ఓ మహిళ పై లైంగిక దాడికి ప్రయత్నించారు కొందరు దుండగులు.

పంట పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లి మరీ… లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దుగ్గిరాల గ్రామానికి కూలీ పనుల కోసం వచ్చి.. అక్కడే ఉంటున్న మహిళ గ్రామంలోని ఆలయంలో నిద్రస్తోంది. అదే సమయంలోనే.. ఈ సంఘటన చోటు చేసుకుంది.

బాధిత మహిళ కేకలు వేయడంతో.. పారిపోయారు యువకులు. దీంతో.. ఘటన స్థలానికి చేరుకున్నారు స్థానికులు. అక్కడికి చేరుకున్ని స్థానికులు డయల్‌ 100 కు ఫోన్‌ చేసి… ఘటన వివరాలు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news