రాయలసీమలో కట్టిన ప్రాజెక్టులన్ని చిల్లర ప్రాజెక్టులు – బైరెడ్డి

-

నంద్యాల: ఈ నెల 28న సిద్దేశ్వరం దగ్గర రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు బీజేపీ రాయలసీమ అభివృద్ధి కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సిద్దేశ్వరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి కాకుండా బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించకుంటే స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వాల ను ఎండగడతామని హెచ్చరించారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

రాయలసీమ ప్రజల వలసలను వైసీపీ ప్రభుత్వం నివారించడం లేదని ఆరోపించారు. రాయలసీమ కు చెందిన సీఎం లు ఉండి కుడా చేసిందేమీ లేదన్నారు. రాయలసీమలో కట్టిన ప్రాజెక్టులన్నీ చిల్లర ప్రాజెక్టులు అని వ్యాఖ్యానించారు. ఆ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ కు ఒరిగింది ఏమీ లేదన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news