కుప్పంలో జరిగిన సంఘటనపైనే చంద్రబాబును కలిసా – పవన్‌

-

కుప్పంలో జరిగిన సంఘటనపైనే చంద్రబాబును కలిసానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు.

కుప్పం లో జరిగిన సంఘటన పై కలిశామని.. వైసీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హక్కు అని.. కానీ అడ్డుకుంటున్నారు..ఏపీలో వైసీపీ అరాచక పాలన జరుగుతుందని ఫైర్‌ అయ్యారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తెచ్చారని వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ తెచ్చినవి.. చెత్త జోవో లు వీటికి బ్రేక్ వేయాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. వైజాగ్ లో కూడా నన్ను అడ్డుకున్నారని ఆగ్రహించారు జనసేనాని.

Read more RELATED
Recommended to you

Latest news