అభిమాని ఫ్యామిలీతో కలిసి భోజనం చేసిన బాలయ్య

-

నందమూరి బాలకృష్ణలో ఎంత కోపం ఉంటుందో అంతకు డబుల్ ప్రేమ ఉంటుంది ఆయనలో. అప్పుడప్పుడు మీడియా, తనపైకి దూసుకొస్తున్న ఫ్యాన్స్​పట్ల కోపంగా ప్రవర్తించినా.. అభిమానులంటే ఆయనకు ప్రాణం. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు నిరూపించారు కూడా.

 


తాజాగా బాలయ్య బాబు తనకు అభిమానులంటే ఎంత ప్రేమో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న NBK 107 సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. షూటింగ్ కోసం కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్న బాలకృష్ణ ఓ ఫ్యాన్​ పట్ల తన ప్రేమను చాటుకున్నారు. అసలేం జరిగిందంటే..?

ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌కు బాలయ్య స్వయంగా ఫోన్ చేశారు. తాను కర్నూలులో ఉన్న హోటల్​కు కుటుంబంతో సహా రమ్మని ఆహ్వానించారు. ఫ్యామిలీతో సహా వెళ్లిన హుస్సేన్​ను బాలయ్య ఆత్మీయంగా ఆహ్వానించారు. వారితో కలిసి భోజనం చేశారు. హుస్సేన్‌ కొడుకుతో బాలయ్య ఆడుకుని కాలక్షేపం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

‘అందుకే బాలయ్య మిమ్మల్ని దేవుడు అనేది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ సోషల్ మీడియాలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గతంలో ఆ అభిమానిని కలుస్తా అని మాటిచ్చిన బాలయ్య.. ఆ మాటను గుర్తుపెట్టుకుని స్వయంగా ఫోన్ చేసి పిలుపించుకుని కలవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news