బాలయ్య సూపర్ క్రేజ్ చూడండి గురూ..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు.ప్రస్తుతం బాలయ్య  హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి” అని అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రేసులో తమ సినిమా వున్నట్లు బాలయ్య చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కు బాలయ్య అభిమాని అయిన గోపిచంద్ మలినేని దర్శకుడు కావడం, తనకు రీసెంట్ గా క్రాక్ తో సూపర్ హిట్ రావడం, బాలయ్య  అఖండ తో ఘనవిజయం సాధించి వుండడం తో ఈ సినిమా హక్కుల కోసం విపరీత మైన పోటీ నడుస్తోంది.

ఈ సినిమా కోసం అభిమానుల ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఎలా ఉంది అంటే, నిన్న జరిగినటువంటి టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఈ సినిమా బ్యానర్ కనిపించడం వైరల్ గా మారింది.నిన్న ఆస్ట్రేలియా లో ఇండియా వర్సెస్ బంగ్లా మ్యాచ్ మంచి ఉత్కంఠభరితంగా జరగగా ఇందులో బాలయ్య ఫ్యాన్స్  క్రికెటర్లు తో వున్న వీరసింహా రెడ్డి పోస్టర్స్ తో హల్చల్ చేశారు. దీనిని  డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా షేర్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news