‌పాకిస్థాన్‌ లోనూ…”అఖండ” చెలరేగిపోతుంది : బాలయ్య

-

ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదంపై బాలకృష్ణ మరోసారి స్పందించారు. ఏపీలో సినీ పరిశ్రమ వివాదం పై కలిసికట్టుగా ఉండాలని కోరారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని… సినిమా గోడును అక్కడ పట్టించుకునే వాళ్లు ఎవరున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలయ్య. ఈ సమస్యపై టాలీవుడ్‌ ప్రముఖులు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆయన కోరారు.ఇవాళ అఖండ విజయోత్సవ సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ… అన్ సీజన్ లో అఖండ విడుదల చేశామని… అఖండ పాన్ ఇండియా సినిమానే కాదు పాన్ వరల్డ్ సినిమాగా మారిందని వెల్లడించారు. పాకిస్థాన్ లో కూడా అఖండ చెలరేగిపోతుందని ఆయన తెలిపారు. అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అఖండైన విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన ఫ్యాన్స్‌ కు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు బాల కృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news