ఆ మాటలతో విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!!

-

గత కొద్ది రోజుల నుంచి బాలకృష్ణకు అలాగే నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కూడా బాలయ్య.. హరికృష్ణ కొడుకులను ప్రస్తావించింది లేదు.. అలాగే బింబిసారా ఈవెంట్ లో కూడా బాలకృష్ణ గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంబోధించింది లేదు. దీన్ని బట్టి చూస్తే సందేశాలు కూడా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు బాలకృష్ణ బింబిసార సినిమాపై స్పందించి అటు కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు.

ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ కి ఉద్దేశించి సినిమా బాగా చేశావు.. త్వరలో మనం సినిమా చేద్దాం.. నీలాంటి యంగ్ స్టర్స్ కావాలి.. మెల్లిమెల్లిగా కాకుండా మొదటిసారి ఇంత పెద్ద సినిమా బాగా చేశావు.. ఇంతటి అవకాశం ఇవ్వడం మా నందమూరి వంశానికే చెల్లింది అంటూ తమ వారసులను తెగ పొగిడేశారు బాలయ్య. ఇకపోతే తాజాగా నందమూరి కుటుంబ సభ్యులంతా సినిమా చూడడానికి రావడం జరిగింది. బాలకృష్ణ, మోక్షజ్ఞ తో పాటు అందరూ వచ్చి సినిమా చూసి సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ని అభినందించడం జరిగింది. మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇవ్వాలి.. అన్నయ్య హరికృష్ణ దీవెనలు, బాబాయిగా నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయని కళ్యాణ్ రామ్ ఉద్దేశించి అన్నారు. మా నందమూరి వంశస్థులు ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళని, టాలెంటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ఇక నాన్నగారు అప్పట్లోనే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు తీశారు. ఇందులో మంచి సందేశం కూడా ఉంది అని , అభినందించారు. సినిమా చూసి బాలకృష్ణ అభినందించడం వైరల్ గా మారింది. దీంతో మా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా తొలగిపోయాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news