బాలయ్య : ప్లేస్ మారింది అంతే ! కాని రీసౌండ్ అదిరి పోతుంది!

-

నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్   సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలయ్య కు తగ్గట్టుగా  అదిరిపోయే ఫైట్స్ , సూపర్ డైలాగ్స్,  సూపర్ క్లైమాక్స్  ఉండనున్నాయట.  ఈ సినిమా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మాస్ ను రాప్పడించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ టీజర్, సాంగ్స్ సినిమా పై  అంచనాలు విపరీతంగా పెంచాయి. బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో , అలాగే గోపి చంద్ మలినేని  సూపర్ హిట్ క్రాక్ తర్వాత వస్తుండంతో ఫ్యాన్స్ లో  జోష్   ఉంది . ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పొలిటికల్ గా కూడా వివాదాస్పదం అయింది.

వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 6న ఒంగోలులోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గం.ల కు  పెట్టుకుందాం అని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దానితో ప్లేస్ మార్చి అదే సమయానికి అక్కడి అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో తమ ఈవెంట్ ని నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య బాబు ఫ్యాన్స్ పోటేత్తే అవకాశం ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news