ఏపీలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయి – చంద్రబాబు

-

నిన్న రాత్రి చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి పార్టీ కార్యాలయం వరకు నిరసన పాదయాత్ర చేస్తున్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే వెనక్కు వెళ్లిపోయిందన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ ని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని.. నా లైఫ్ కు భద్రత ఉందా? అని ప్రశ్నించారు.

 

ఇలా నడుచుకుంటూ వెళితే ఎవరైనా రౌడీ తనపై దాడి చేయవచ్చు అన్నారు చంద్రబాబు. ఇలాంటి రోడ్ షోలు ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త కాదని.. దురుదోషంతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పని అయిపోయిందని.. ఇక ఇంటికి వెళతాడని ఎద్దేవా చేశారు. ఆయనకి ఓటు వేసిన వారు ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందన్నారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అంటూ మండిపడ్డారు.

కుప్పంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. వైయస్సార్, షర్మిల, విజయమ్మ, జగన్.. ఇలా అందరూ పాదయాత్ర చేశారని.. వారిని తాను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు అన్నారు. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news