ఓటమి అంచుల్లో YSRCP.. అది జగన్​కూ తెలుసు : నందమూరి బాలకృష్ణ

-

వైఎస్సార్సీపీ ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన పార్టీ, తాను ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం జగన్​కు కూడా తెలుసని అన్నారు. వైస్సార్సీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొననున్నారు. ఈ క్రమంలో మార్తాడులోని ‘యువగళం’ క్యాంప్‌ సైట్‌ వద్దకు ఆయన వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బాలయ్య చెప్పారు.

‘‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. ఆ పార్టీ అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని బాలయ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news