పవన్ విషయంలో బాలయ్య వార్నింగ్..అంబటిపై నాగబాబు ఫైర్.!

-

ఆహా అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ గెస్టులతో..షోని రక్తికట్టిస్తున్నారు. అలాగే ఈ షోలో రాజకీయ నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ వచ్చారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వచ్చారు. తాజాగా అటు సినీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన పవన్ గెస్ట్‌గా వచ్చారు. ఇక బాలయ్య-పవన్ కాంబినేషన్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అయితే టీడీపీ-జనసేన పొత్తులో భాగంగానే మొన్న పవన్‌ని చంద్రబాబు కలిశారని, ఇప్పుడు షో ద్వారా బాలయ్య-పవన్ కలిశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎవరు కలిసొచ్చిన జగన్‌కు ప్రజలు ఉన్నారని మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య..పవన్‌ని కొన్ని సంచలన ప్రశ్నలు అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. మొదట పవన్ పెళ్లిళ్లపై ప్రశ్న అడిగినట్లు సమాచారం.

పొత్తుల వార్తలకు బలం

దీనిపై పవన్ సమాధానం చెప్పిన తర్వాత..బాలయ్య ఇకపై ఎవరైనా పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వారు ఊరకుక్కలతో సమానమని వార్నింగ్ ఇచ్చారట. అంటే పరోక్షంగా వైసీపీ నేతలని ఉద్దేశించే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇంకా టీడీపీ-జనసేన పొత్తు గురించి కూడా అడిగినట్లు సమాచారం. అలాగే ఈ షోకి సాయి ధరమ్ తేజ్, క్రిష్ సైతం గెస్టులుగా వచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే బాలయ్య-పవన్ షోపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు.  “అన్నయ్య షో కి డుమ్మా. బాలయ్య షో కి జమ్మ. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా ? అని” అంబటి రాంబాబు ట్విట్ చేయగా దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. “ఏయ్.. ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్… ఛీ పో వెధవ సోది” అని నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి టీడీపీ-జనసేన పార్టీలు, నందమూరి-మెగా కుటుంబాలు కలిసి..వైసీపీకి చెక్ పెట్టేలా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news