బండి సంజయ్, అరవింద్ బలిషి మాట్లాడుతున్నారు..బట్టలు ఊడదీసి కొడతారు : బాల్క సుమన్

-

తెలంగాణ బిజేపి ఎంపి లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. తెలంగాణ బిజెపి ఎంపీలు సభ్యత…సంస్కారం లేకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ బలిషి మాట్లాడుతున్నారని.. ఇదే పద్ధతిలో ఉంటే తెలంగాణ రైతులు వాళ్ళను బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. తెలంగాణ రైతులపై బిజెపి కక్ష కట్టిన్నటు కనిపిస్తుందని.. వడ్లు కొంటరా …కొనరా ? మాట్లాడకుండా …సీఎం కేసీఆర్ పై అడ్డం దిడ్డంగా మాట్లాడుతున్నారని అగ్రహించారు.

పసుపు బోర్డు తేలేని సన్నాసి ధర్మపురి అరవింద్ అని.. పార్లమెంట్ సభ్యులలా కాకుండా పనికిరాని వాళ్ళల బిజెపి ఎంపీలు మాట్లాడ్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడకపోతే …వాళ్ళ పని చేస్తామని హెచ్చరించారు. చేతగాని మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపీలు అని తెలంగాణ ప్రజలు అంతా అంటున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ బీజేపీలో చిల్లర గాళ్ళు తయారు అయ్యారని.. బండి సంజయ్ ,అరవింద్ మాటలను తెలంగాణ సమాజం ఖండించాలని కోరారు. హైదరాబాద్ పై బిజెపి కుట్ర చేస్తుందని.. తెలంగాణ …గుజరాత్ ను ఎక్కడ దాటి పోతుందో అని ఢిల్లీ డైరెక్షన్ ప్రకారం ఇక్కడి నేతలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news