తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో జమ్మిక్కు – బండి సంజయ్

-

ఎంఐఎం అంటే కేసీఆర్ కు భయమని… అందుకే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తుండటం సిగ్గు చేటు అని చురకలు అంటించారు. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని… ‘విమోచన దినం’ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు.

తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట మరో జమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ అని.. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే తక్షణమే విమోచనోత్సవాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానిస్తున్నారు… అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గమని ఆగ్రహించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news