BREAKING : బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర వాయిదా

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమార్‌ పాదయాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడం తో .. బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుండి 5 వ విడత యాత్ర జరగాల్సి ఉంది.

కానీ మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడం తో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ కుమార్‌ పాదయాత్ర వాయిదా పడింది. ఈ ఉప ఎన్నిక అయ్యాక ఈ యాత్ర ప్రారంభం పై క్లారిటీ రానుంది. కాగా.. ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు కాసేపటి క్రితమే షెడ్యూల్‌ విడుదల.. అయింది.

ఈ షెడ్యూల్‌ ప్రకారం… ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అలాగే.. 17 వరకు ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది. ఇక నవంబర్‌ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news