సీఎం మమత బెనర్జీపై బండి సంజయ్ ఆగ్రహం

-

పేదలకు సేవ చేస్తున్న రామకృష్ణ మిషన్, ఇస్కాన్, భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు శోచనీయం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ మైలేజీ కోసం కీర్తి ప్రతిష్టలు ఉన్న సంస్థలపై చిల్లర నిందలు వేయడం ముఖ్యమంత్రి పదవికి సరికాదని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ మమతా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఇటీవల ఆరంబాగ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నేతల ప్రభావంతో పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వారు దేవాలయాలను చూసుకునే వారు గొప్ప ఆధ్యాత్మిక ఉద్యోగులు. కానీ కొందరి ప్రమేయంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం మమతా బెనర్జీ వెనక్కి తగ్గారు.

Read more RELATED
Recommended to you

Latest news